Kishan Reddy | కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడాను: కిషన్ రెడ్డి

-

రాష్ట్రంలో వరద పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన ప్రజలకు, ప్రాంతాలకు చేతనైనంత సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడానికి రెండు హెలికాప్టర్లు సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పనుల కోసం మెహరించారని తెలిపారు.

- Advertisement -

ఇప్పటికే వరలతో ఇళ్లు నీటమునిగి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజల నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతేగాక, రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Read Also: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...