Komatireddy Venkat Reddy | రేవంత్ వ్యాఖ్యలకు ఎంపీ కోమటిరెడ్డి కౌంటర్

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంటు ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన సొంత పార్టీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) స్పందిచారు. ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ అంటే అది ఇక్కడ నడువదని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి జాతీయ విధానం ఉంటుందని, రేవంత్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా..? ఆయన ఏ సందర్భంలో అన్నారో క్లారిటీ ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్‌లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్ గురించి ఆయనకు తెలియక పోవచ్చన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల కరెంటు ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో పెడుతామన్నారు. తెలంగాణలో రోజుకు 10 నుంచి 20 సార్లు కరెంటు పోతుందన్నారు. రేపు వచ్చేది మా ప్రభుత్వమేనని అన్నారు. ఉచిత విద్యుత్ విషయాన్ని మా మేనిఫెస్టోలో పెడతామని కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు.

Read Also: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను అప్రమత్తం చేసిన కేటీఆర్

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...