మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన MP Venkat Reddy

-

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్లీనరీ సమావేశం నిమిత్తం రాయ్‌పూర్ వెళ్లిన కోమటిరెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీలో చోటు కల్పిస్తే మరింత ఉత్సాహంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని లేకుంటే.. తన పరిధిలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతానని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తులు అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని ఏఐసీసీ చీఫ్ ఖర్గేనే చెప్పారని గుర్తుచేశారు.

- Advertisement -

రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించేందుకు ప్రియాంక గాంధీని అపాయింట్మెంట్ కోరానని త్వరలో ఢిల్లీలో భేటీలో అవుతానని వెంకట్ రెడ్డి((Komatireddy Venkat Reddy)) చెప్పారు. అంతేగాక, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్(KCR) ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని, గత ఎన్నికల లాగా కాకుండా ఈసారి టికెట్ల కేటాయింపు త్వరగా జరిగేలా చూడాలని, ముఖ్యంగా ఆశావాహులు ఎక్కువగా ఉన్నచోట కొంత ఆలస్యం జరిగినా.. పట్టు ఉన్న చోట్ల మాత్రం అభ్యర్థులను వెంటనే ప్రకటించాలని, ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...