MLA Kausar Moinuddin | అర్ధరాత్రి బైకుపై పర్యటించిన ఎమ్మెల్యే

-

నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యే వినూత్నంగా ప్రయత్నించారు. రాత్రి ఒంటరిగా బైకుపై తిరుగుతూ కాలనీలను సందర్శించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే కౌసల్ మోయునుద్దీన్(MLA Kausar Moinuddin) శుక్రవారం రాత్రి బుల్లెట్ బండి‌పై నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కరే పర్యటించారు.

- Advertisement -

నాదీం కాలనీ, ఆఫ్సార్ కాలనీ, షాదం తలాబ్, హకీంపేట్, బాగ్దాద్ కాలనీ, టోలిచౌకి, గోల్కొండ, రేషంభాగ్, చోటాబజారు తదితర ప్రాంతాల్లో తిరిగారు. ఈ సందర్భంగా ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితిలను స్వయంగా పరిశీలించారు. ఎల్ఈడీ లైట్లు పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేశారు. అదేవిధంగా సీసీ రోడ్లు తదితర పనులను పరిశీలించారు. స్థానికులు ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఆయన(MLA Kausar Moinuddin) పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.

Read Also: మొదటి పోస్టుతోనే మనసుల్ని గెలుచుకున్న పవన్ కల్యాణ్
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...