Minister KTR | అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేసిన కేటీఆర్

-

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్(Hardeep Singh) పూరిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరారు. ల‌క్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వ‌ర‌కు 26 కిలోమీట‌ర్లు, నాగోల్ నుంచి ఎల్‌బీన‌గ‌ర్ వ‌ర‌కు 5 కిలోమీట‌ర్ల మెట్రో లైన్‌కు ఆమోదం తెలిపి, ఆర్థిక స‌హాయం చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని మరొక ప్రతిపాదనను కేటీఆర్ స‌మ‌ర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన లింకు రోడ్డుల కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేశామని, మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఇదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు రూ. 2,400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 800 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కేటీఆర్(Minister KTR) విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Read Also:
1. ఆకట్టుకుంటోన్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ టీజర్
2. పార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....