మెట్రోలో నిలబడి ప్రయాణించిన మంత్రి కేటీఆర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బేగంపేట(Begumpet) మెట్రో వరకు విపరీతమైన రద్దీలో నిల్చునే ప్రయాణించిన ఆయన తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. కేటీఆర్ కూడా అందరికి ఓపికతో సెల్ఫీలిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు రోడ్ షోలు, సమావేశాలతో హోరెత్తిస్తున్న కేటీఆర్(KTR).. మరోవైపు యువతతో ముచ్చటించటం, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటీవల పాతబస్తీలో షాదాబ్ హోటల్‌కు కస్టమర్లను పలకరించి బిర్యానీ కూడా తింటూ బీఆర్ఎస్‌(BRS) ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఫేమస్ ఐస్‌క్రీమ్ స్పాట్ మొజంజాహి మార్కెట్‌కు వెళ్లి సందడి చేశారు.

Read Also: బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...