Jagadish Reddy | రేవంత్ వ్యాఖ్యలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్

-

Jagadish Reddy | కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తప్పవని BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తమ వైఫల్యాలను తపించుకునేందుకు కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆదివారం CM రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి జరుగుతున్న అన్యాయానికి పాపాల భైరవుడు కేసీఆర్ అని రేవంత్(Revanth Reddy) ఆరోపించారు. కేసీఆర్ కమీషన్లకు లొంగిపోయి, ఏపీ CM జగన్ మోహన్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) కౌంటర్ ఇచ్చారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి ప్రాజెక్టులు అప్పగించాలని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, ఎవరు ద్రోహులో తేల్చుకుంటామని సవాల్ చేశారు. 20 ఏళ్లుగా ప్రజల కోసం కొట్లాడింది, రాష్ట్రానికి నీళ్ళు తెచ్చింది కేసీఆర్ అన్నారు. కేసీఆర్(KCR) వచ్చాకనే రాష్ట్రంలో పంటలు పండాయన్నారు. కేంద్రంతో లాలూచీ పడి ప్రాజెక్టులు అప్పగించింది మీరు అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరోపించారు. మారు వేషాలు వేసుకొచ్చి మాట్లాడి తప్పించుకోవాలి అనుకుంటున్న పాపాల భైరవులు మీరు అని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి.

Read Also: సీట్ల సర్దుబాటుపై టీడీపీ – జనసేన మధ్య స్పష్టత
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...