Munugode By Poll: మర్రిగూడ మండల పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత

-

Munugode By Poll live updates police lathi charge in marriguda మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ వాడివేడిగా జరుగుతుంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ భూత్‌‌ల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలింగ్‌‌లో స్థానికేతరులు వున్నారని పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో అదుపు చేసే క్రమంలో బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు కంప్లైంట్ చేసినా గజ్వేల్, సిద్దిపేట టీఆర్ఎస్ నేతలు ఇక్కడే వున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్‌‌కి ఓటేయాలని లేకుంటే పెన్షన్లు రద్దుచేస్తామని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే.. నెలకొన్న ఉద్రిక్తతను అదుపులోకి తీసుకురావడానికి మర్రిగూడ మండల కేంద్రంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...