Cantonment Bypoll | సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్

-

Cantonment Bypoll | సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ప్రముఖులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న రెండో కుమార్తె నివేదిత(Niveditha)ను అభ్యర్థిగా ఖరారుచేసిటన్లు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

- Advertisement -

లాస్య మరణం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక(Cantonment Bypoll)కు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా శ్రీ గణేష్‌ను ప్రకటించగా.. బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. మరి ఈ ఎన్నికలో సానుభూతితో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు ప్రజలు ఓటు వేస్తారో.. లేదంటే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.

Read Also: ఈ ఘటనకు జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి.. షర్మిల తీవ్ర విమర్శలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Congress Manifesto | లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల లోక్‌సభ ఎన్నికల కోసం...

Ys Avinash Reddy | వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఊరట

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్...