హైదరాబాద్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

-

నకిలీ నోట్లు(Fake Currency) తయారుచేసే ముఠాలపై పోలీసులు ఎంత ఉక్కుపాదం మోపుతున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో భారీ నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను శంషాబాద్‌(Shamshabad) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావు ముఠాగా ఏర్పడి రూ. 50, 100, 200, 500 ఫేక్ నోట్లను సొంతంగా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.11లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రూరల్ ప్రాంతాలే లక్ష్యంగా నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రింట్‌ చేసిన దొంగ నోట్ల(Fake Currency)ను ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని తమ ఏజెంట్లకు 1:3 నిష్పత్తిలో పంపుతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
Read Also: కర్ణాటక ఎన్నికల్లో రికార్డు సృష్టించిన కురువృద్ధుడు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...