Padi Kaushik Reddy | పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు.. అందుకే..

-

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 9న దళితబంధు రెండో విడత డబ్బులు వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చేసిన ధర్నాకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. పాడి కౌశిక్ రెడ్డి.. నవంబర్ 9న అనుమతులు లేకుండా ధర్నా చేసిన కారణంగానే ఆయన సహా పలువురు ఇతర బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 35(3) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ధర్నా చేసిన 15 రోజుల తర్వాత పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా ఉంది. ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ నోటీసులు ఇవ్వడం జరిగిందని, కౌశిక్ రెడ్డిని అణచివేయడానికి, జైలుకు పంపడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy ).. ప్రభుత్వం దళితబంధు నిధులు విడుదల చేయాలంటూ నవంబర్ 9న హుజురాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, దళితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆందోళనను అడ్డుకునేందుకు ఎమ్మెల్యేని, బీఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

దీంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకుండా కార్యకర్తలు అడ్డగించే ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా కారులో కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా.. ఆయన అస్వస్థతకి గురై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్(KTR), హరీష్‌ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

Read Also: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అంటున్న ‘లక్కీ భాస్కర్’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...