కోమటిరెడ్డితో పొంగులేటి, జూపల్లి భేటీ

-

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కోమటిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే వీరిద్దరితో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయి సమాలోచనలు జరిపారు. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరాలని సిద్ధమయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Read Also:
1. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో తెలుగు హీరో

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...