Poonam Kaur: రాహుల్‌ యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్

-

Poonam Kaur: దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్టిన భారత జోడో యాత్ర తెలంగాణలో జరుగుతుంది. ప్రస్తుతం 52వ రోజు ఈ యాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు రాహుల్‌ యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీతో పూనమ్‌ భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 15 నిమిషాలు రాహుల్ గాంధీతో మాట్లాడానని, చేనేత కార్మికులు మహిళల సమస్యలపై చర్చించామని.. రాహుల్ గాంధీ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని అన్నారు. వినతి పత్రాలు ఇవ్వగానే చదివిన తర్వాతే మాట్లాడుతున్నారని తెలిపారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీని తగ్గించాలన్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచన లేదని, సమస్యల మీద పోరాటం చేస్తున్నానని.. చేనేతల కోసం కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయాలని కోరగా కచ్చితంగా చేస్తుందని హామీఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాక మా అమ్మ కూడా చేనేతలు నేసిన చీరే కడుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారని.. మీరు మా అమ్మను చెల్లిని ఒకసారి కచ్చితంగా కలవమని కోరినట్లు  పూనమ్ కౌర్ (Poonam Kaur) తెలిపారు.

Read also: వైసీపీ, టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...