మహిళలపై వేధింపులు.. ప్రభుత్వానికి MLA రఘునందన్ రావు సూటి ప్రశ్న

-

రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామం తాజా, మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఇవాళ రఘునందన్ రావు స్పందించారు.

- Advertisement -

నిధులు రాక అప్పుల బాధతో, అవమానం భరించలేక మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపించారు. మహిళా బిల్లు, మహిళల పైన కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవితకు ఇవి కనిపించవా అని ప్రశ్నించారు. మహిళలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత వివక్ష.. పక్క రాష్ట్రంలో మహిళలకు ఏదైనా అయితే స్పందించే అధికారి స్మితా సబర్వాల్, మహిళా కమిషనర్ సునీత రెడ్డి ఎందుకు ఈ మౌనం అని నిలదీశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...