Rangam Bhavishyavani | భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

-

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి(Ujjaini Mahankali) అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతున్నది. అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భక్తులకు భవిష్యవాణి(Rangam Bhavishyavani) వినిపించారు. ‘ప్రజలు చేసిన పూజలు సంతోషంగా అందుకున్నా. గతేడాది మీరు ఇచ్చిన వాగ్దానం మరిచారు.

- Advertisement -

కావాల్సిన బలాన్ని ఇచ్చాను.. మీవెంటే నేను ఉంటా. వర్షాలు తప్పనిసరిగా వస్తాయి. మీరు భయపడవద్దు. ఆలస్యమైనా వానలు తప్పనిసరిగా వస్తాయి. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలి. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నా’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రంగం(Rangam Bhavishyavani) కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Talasani Srinivas Yadav) పాల్గొన్నారు.

Read Also: ఇకపై అలా జరగడానికి వీళ్లేదు.. టీ-బీజేపీ నేతలకు నడ్డా స్వీట్ వార్నింగ్

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...