సిగ్గు లేకుండా మళ్లీ పరీక్షలు పెడతామనడం ఏంటి?: RSP

-

మంత్రి కేటీఆర్‌(KTR)పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తీవ్ర విమర్శలు చేశారు. ఎవరికీ తెలియని సమాచారం కేటీఆర్ దగ్గర ఎక్కడిదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాలు లీక్ అవడానికి కారకులు ఎవరో జనార్థన్ రెడ్డి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరుద్యోగుల పక్షాన ఉంటారో.. దొంగల పక్కన ఉంటారో తేల్చుకోవాలన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా.. పేపర్ లీకేజీపై కొట్లాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి లాంటి కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటం చేస్తే కేయూ విద్యార్థులపై అన్యాయంగా కేసులు పెట్టి తెల్లవారుజామున అరెస్టు చేసి తీసుకెళ్లారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మండిపడ్డారు. పేపర్ లీకేజీకి సంబంధించిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో అనేక ప్రశ్నాపత్రాలు దొరికాయన్నారు. మరికొందరు నిందితుల ఇళ్లల్లో ప్రశ్నాపత్రాలతో పాటు జవాబులు కూడా దొరికాయని చెప్పారు. అయినా సిగ్గు లేకుండా మళ్లీ పరీక్షలు పెడతామని కమిషన్ చైర్మెన్ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: IPL ఫ్రారంభ వేడుకలో అదరగొట్టిన తమన్నా, రష్మిక

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...