విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

-

తెలంగాణ ఎన్నికల సందర్భంగా బుధవారం, గురువారం హైదరాబాద్‌(Hyderabad)లోని విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. నవంబర్‌ 30న పోలింగ్ సందర్భంగా నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 1న యదావిధిగా విద్యాసంస్థలు నడవనున్నాయని వెల్లడించారు. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు.

- Advertisement -

మరోవైపు పోలింగ్ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు ఈనెల 30న వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర కార్మికశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కార్మికశాఖ స్పెషల్ సెక్రటరీ.రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...