విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

-

తెలంగాణ ఎన్నికల సందర్భంగా బుధవారం, గురువారం హైదరాబాద్‌(Hyderabad)లోని విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. నవంబర్‌ 30న పోలింగ్ సందర్భంగా నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 1న యదావిధిగా విద్యాసంస్థలు నడవనున్నాయని వెల్లడించారు. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు.

- Advertisement -

మరోవైపు పోలింగ్ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు ఈనెల 30న వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర కార్మికశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కార్మికశాఖ స్పెషల్ సెక్రటరీ.రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...