పండుగపూట తీవ్ర విషాదం.. అన్న శవానికి రాఖీ కట్టిన చెల్లెలు

-

Peddapalli | రాఖీ పండుగ ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నాదమ్ముల అనుబంధాన్ని ఈ పండుగ కళ్లకు కట్టేలా చూపుతుంది. ఈ విశ్వంలో అన్నాచెళ్లెలు ఎక్కడ స్థిరపడ్డా.. రాఖీ పండుగ రోజున వెతుక్కుంటూ వచ్చి మరీ రాఖీ కడుతుంటారు. అది ఈ పండుగకున్న విశిష్టత. అయితే.. ఈ పండుగ వేళ మాటలకు అందని విషాదం చోటుచేసుకుంది. పండుగపూట అన్న మరణవార్త విన్న చెల్లెలి గుండె బద్దలైంది. దు:ఖాన్ని ఆపుకోలేక అన్న శవానికి రాఖీ కట్టి అందరిచేత కంటనీరు తెప్పించింది.

- Advertisement -

ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనుకయ్య సోమవారం గుండెపోటుతో మరణించాడు. అతని అంత్యక్రియలను మంగళవారం నిర్వహించాల్సి ఉంది. రాఖీ పండుగకు ఒక్క రోజు ముందే తన అన్న మరణించడంతో అతని చెల్లెలు గౌరమ్మ ఎంతగానో కుమిలిపోయింది. సోదరుడి మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టి తన పేగుబంధాన్ని చాటుకుంది. గౌరమ్మ రోదన చూసిన వాళ్లందరినీ దుఃఖ సాగరంలో ముంచేసింది.

Read Also: సీటు వదిలేయడానికి సిద్ధం.. ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...