సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ పై వీధి కుక్క దాడి

-

Siddipet |తెలంగాణలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృత్యువాత పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనా.. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వీధి కుక్కల దాడులు జరిగుతూనే ఉన్నాయి. తాజాగా.. సిద్దిపేట(Siddipet) అద‌న‌పు క‌లెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితోపాటు మ‌రో ఇద్దరిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా అడిషనల్ కలెక్టర్(Additional Collector) శ్రీనివాస్ రెడ్డి తన క్వార్టర్స్ ఆవరణలో పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఓ వీధి కుక్క అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసింది. అతని రెండు కాళ్ల పిక్కలను పట్టి తీవ్రంగా గాయపరించింది. అంతేకాదు అడిషనల్ కలెక్టర్ పెంపుడు కుక్కపైనా దాడి చేసింది.

Read Also:  అమరావతి ఆర్5 జోన్ జీవోపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...