Supreme Court – Gaddam Prasad Kumar | తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలని బీఆర్ఎష్ మంకుపట్టు పడుతోంది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్కు(BRS) అక్కడ ఆశించిన ఫలితం దక్కలేదు. అసెంబ్లీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్. కాగా సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఎటువంటి పురోగతి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా అసలు ఫిరాయింపు నేతల విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు మార్చి 25లోపు సమాధానం చెప్పాలని కోరింది. మరి దీనిపై స్పీకర్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం కీలకంగా మారింది.