Gaddam Prasad Kumar | ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

-

Supreme Court – Gaddam Prasad Kumar | తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలని బీఆర్ఎష్ మంకుపట్టు పడుతోంది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్‌కు(BRS) అక్కడ ఆశించిన ఫలితం దక్కలేదు. అసెంబ్లీ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్. కాగా సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఎటువంటి పురోగతి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా అసలు ఫిరాయింపు నేతల విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు మార్చి 25లోపు సమాధానం చెప్పాలని కోరింది. మరి దీనిపై స్పీకర్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం కీలకంగా మారింది.

Read Also: కేసీఆర్‌ను కలిసి ఫిరాయింపు నేత.. అందుకోసమేనా..!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...