సుప్రీంకోర్టులో కేఏ పాల్‌కు అనూహ్య పరిణామం

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌(KA Paul)కు సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది. ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ(CBI) విచారణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన వేసిన పిటిషిన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. అగ్నిప్రమాద ఘటనలపై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది. సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నరబలి అని కేఏ పాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. తన కేసులో తానే స్వయంగా వాదనలు వినిపించారు. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమని ఆదేశించాలా అంటూ సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. కేఏ పాల్ దాఖలు చేసిన పిటీషన్ ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -
Read Also: బలగం సినిమాపై బండి సంజయ్‌ ప్రశంసల వర్షం.. కేసీఆర్‌కు అంకితం అంటూ సెటైర్లు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...