బీఎస్పీ తెలంగాణ చీఫ్ RS ప్రవీణ్ కుమార్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

-

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌(RS Praveen Kumar)కి తృటిలో పెద్ద ప్రమాదం ఉంది. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. RSP వాహనంలో ఉండగానే వెనక నుంచి లారీ ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఆయను ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

కాగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar), ఆయన కుమారుడిపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి బీఎస్పీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. కాగజ్‌నగర్ పోలీసులు తనపైనా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ స్కాలర్ అయిన తన కుమారుడితోపాటు పార్టీలోని మరో 11 మంది సీనియర్ సభ్యులపైనా హత్యాయత్నం(సెక్షన్ 307) కింద కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప(Koneru Konappa) కనుసన్నల్లోనే ఈ కేసులు నమోదయ్యాయని ఆరోపించారు.

ఎమ్మెల్యే వాహనం నుంచి తాను రూ. 25 వేలు దొంగిలించానని కోనప్ప డ్రైవర్ ఫిర్యాదు చేశాడన్నారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అందులోనూ 26 ఏళ్లు ఎటువంటి మచ్చలేకుండా సేవ చేసిన అధికారి రూ. 25 వేలు దొంగతనం చేస్తాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ దుష్పరిపాలనకు ఇదో మచ్చుతునక అని విమర్శించారు. ఇలాంటి తప్పుడు కేసులు తనను భయపెట్టలేవని.. బీఆర్ఎస్, బీజేపీ కూటమి కుట్రల నుంచి తెలంగాణను కాపాడతానని ఆయన శపథం చేశారు.

Read Also: కుక్క కరిస్తే రూ.10వేలు పరహారం.. ఎక్కడో తెలుసా..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...