Gas price | రూ.500లకే గ్యాస్ సిలిండర్.. గైడెలైన్స్‌ విడుదల..

-

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందించింది. మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi Scheme) భాగంగా మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మార్గదర్శకాలను ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు జీవో విడుదల చేసింది. సబ్సిడీ సిలిండర్(Gas price) కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన వారి ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు.ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది.

- Advertisement -

Gas price

మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు.

వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి.

48 గంటల్లోనే వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ జమ చేస్తారు.

గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా OMC సంస్థలకు ఇవ్వనుంది.

సంస్థల నుంచి DBT ద్వారా వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది ప్రభుత్వం.

భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూ.500 చెల్లించేలా ఏర్పాటు చేయనుంది.

Read Also: రమణ దీక్షితులుపై వేటు.. TTD బోర్డు కీలక నిర్ణయం.. 
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...