Traffic Challan | వాహనదారులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్

-

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ చలాన్ల(Traffic Challan) రాయితీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఇచ్చిన ట్రాఫిక్ చలాన్ల గడువు ఈరోజుతో ముగియాల్సి ఉంది. ఆఖరి రోజు కావడంతో వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ఆసక్తి కనబరిచారు. ఇదే తరుణంలో మరోసారి డిస్కౌంట్ గడువును ఈ నెల 31 వరకు పెంచుతూ వాహనదారులకు ఊరట కల్పించింది తెలంగాణ సర్కార్.

- Advertisement -

కాగా, డిస్కౌంట్ కల్పించడంతో డిసెంబర్ 26 నుంచి నిన్నటివరకు పెండింగ్ చలాన్ల(Traffic Challan)పై రూ.100 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ ఉండగా ఒక కోటి 14 లక్షల చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలోనే రూ.57 కోట్ల రూపాయలు వసూలు చేసింది సర్కార్.

Read Also: మధురై కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....