Traffic Challan | వాహనదారులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్

-

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ చలాన్ల(Traffic Challan) రాయితీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఇచ్చిన ట్రాఫిక్ చలాన్ల గడువు ఈరోజుతో ముగియాల్సి ఉంది. ఆఖరి రోజు కావడంతో వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ఆసక్తి కనబరిచారు. ఇదే తరుణంలో మరోసారి డిస్కౌంట్ గడువును ఈ నెల 31 వరకు పెంచుతూ వాహనదారులకు ఊరట కల్పించింది తెలంగాణ సర్కార్.

- Advertisement -

కాగా, డిస్కౌంట్ కల్పించడంతో డిసెంబర్ 26 నుంచి నిన్నటివరకు పెండింగ్ చలాన్ల(Traffic Challan)పై రూ.100 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ ఉండగా ఒక కోటి 14 లక్షల చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలోనే రూ.57 కోట్ల రూపాయలు వసూలు చేసింది సర్కార్.

Read Also: మధురై కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...