Telangana | బీసీలకు లక్ష సాయంపై సర్కార్ గుడ్ న్యూస్

-

Telangana | రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (6వ తేదీ) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. తాజాగా.. రూ.లక్ష సాయం అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌ను సైతం మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ఆరంభించారు. ఈ పథకం కోసం కొందరి సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. తాజాగా కేబినెట్ సబ్ కమిటీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్ శుభవార్త చెప్పారు. బీసీలకు రూ.లక్ష సాయం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్న మంత్రి..ప్రతీ నెల 5వ తేదీ లోపు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఆ తరువాత ప్రతీ నెల 15న స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ.లక్ష సాయం అందించనున్నారు. సాయం అందిన వారు నెలరోజుల్లో పనిముట్లు కొనుక్కోవాలని మంత్రి కోరారు.

- Advertisement -
Read Also:
1. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ సంచలన వ్యాఖ్యలు
2. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో భారీ చోరీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...