దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల దోషులకు హైకోర్టులో చుక్కెదురు

-

Dilsukhnagar Bomb Blast Case | 2013 దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వీరికి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విధించిన మరణశిక్షలను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఉరి శిక్షలను రద్దు చేయాలంటూ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం కోర్టు తోసిపుచ్చింది. డిసెంబర్ 16, 2016న NIA ప్రత్యేక కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి మరణ శిక్ష విధించింది. 18 మంది మృతి చెంది, 131 మంది గాయపడిన ఉగ్రవాద దాడుల్లో యాసిన్ భత్కల్, జియా-ఉర్-రెహ్మాన్ అలియాస్ వకాస్, అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, తెహ్సీన్ అక్తర్, ఐజాజ్ షేక్ లను దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరించింది.

- Advertisement -

కాగా, ఫిబ్రవరి 21, 2013న హైదరాబాద్‌ లోని దిల్‌సుఖ్‌నగర్ మార్కెట్‌ లో పేలుళ్లు జరిగాయి. మొదటి పేలుడు మలక్‌ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ స్టాప్ సమీపంలో జరిగింది. ఆ తర్వాత కొన్ని సెకన్లకే సైబరాబాద్‌ లోని సరూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని A-1 మిర్చి సెంటర్ షాపు సమీపంలో రెండవ పేలుడు సంభవించింది. ఘటనపై కేసులు నమోదు చేసిన తర్వాత, హోం మంత్రిత్వ శాఖ రెండు కేసులను దర్యాప్తు కోసం NIAకి బదిలీ చేసింది.

Dilsukhnagar Bomb Blast Case | దర్యాప్తులో NIA ఇండియన్ ముజాహద్దీన్ కి చెందిన ఇద్దరు సీనియర్ కార్యకర్తలైన అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాకు చెందిన యాసీన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీలను ఆగస్టు 2013లో ఇండో-నేపాల్ సరిహద్దు నుండి అరెస్టు చేసింది. మార్చి 2014లో, తెహ్సీన్ అక్తర్, పాకిస్తాన్ జాతీయుడు జియా-ఉర్-రెహ్మాన్‌ లను ఢిల్లీ పోలీసులు రాజస్థాన్‌ లో అరెస్టు చేశారు. కుట్రలో పాల్గొన్నందుకు పూణేకు చెందిన ఐజాజ్ షేక్‌ ను కూడా అరెస్టు చేశారు.

Read Also: వంట నూనెను మళ్ళీమళ్ళీ వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే..!
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...

వాహనాలకు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు.. ఎందుకు? లేకపోతే ఏమౌతుంది?

తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం...