టికెట్ రాకపోవడంతో వెక్కి వెక్కి ఏడ్చిన తాటికొండ రాజయ్య

-

బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో స్టేషన్‌ ఘున్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) వెక్కి వెక్కి ఏడ్చారు. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన రాజయ్య.. ప్రాంగంణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని భోరున విలపించారు. అనంతరం మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నతస్థానం కల్పిస్తామని కేసీఆర్(KCR) తనకు చెప్పారని అధినేత మాటను గౌరవించి ముందుకు సాగుతానని తెలిపారు. ముఖ్యంగా వరుస వివాదాలు ఆయనకు అవకాశాలను దెబ్బతీశాయి.

- Advertisement -

జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణల వ్యవహారం రాజయ్యకు బాగా మైనస్ అయింది. ఓవైపు నవ్య ఎపిసోడ్ రచ్చ.. మరోవైపు కడియం శ్రీహరి(Kadiyam Srihari)తో విభేదాలను అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. దీంతో రాజయ్యను పక్కన పెట్టిన కేసీఆర్.. కడియం శ్రీహరికి టికెట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు రెండు రోజుల క్రితం టికెట్ రావాలని రాజశ్యామల యోగం కూడా చేశారు తాటికొండ. అయినా ఫలితం లేకుండా పోయింది.

మరోవైపు ఆయన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు. కాగా 2014లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య(Thatikonda Rajaiah)కు కేసీఆర్ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆరోగ్యశాఖ మంత్రి శాఖ కేటాయించారు. అయితే అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఆయనను ఆ పదవుల నుంచి కేసీఆర్ తీసివేశారు. 2018లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

Read Also: కవిత కోసమే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారా?
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...