మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన తుల ఉమ

-

బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ(Thula Uma) బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్(KTR) ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి ఉమక్క ఘటనే నిదర్శనమన్నారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి.. బీఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరమన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రగల్భాలు పలికిన బీజేపీ(BJP) తుల ఉమను తీవ్రంగా అవమానించిందన్నారు. కేసీఆర్(KCR) సూచన మేరకు ఆమెకు పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.

- Advertisement -

బీసీ వ్యక్తిని బీజేపీ సీఎం చేసేది ఓ కల మాత్రమే అని తుల ఉమ(Thula Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి కేటాయించారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌లో చేరడంతో సొంత గూటికి వచ్చినట్లు ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఇవాళ ఉదయం బీజేపీకి ఆమె రాజీనామా చేసిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా బీజేపీ అధిష్టానంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

Read Also: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...