Mahesh Kumar Goud | రాజకీయాల్లో రాణించాలంటే అలా చేయాల్సిందే!

-

రాజకీయాల్లో రాణించాలంటే ఒంటెద్దు పోకడ ఏమాత్రం పనికిరాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. సమయానుకూలంగా సమన్వయంతో నడుచుకుంటేనే రాజకీయాల్లో ముందడుగు వేయగలుగుతామని వివరించారు. మహేశ్వరం గట్టుపల్లిలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్(Youth Congress) ట్రైనింగ్ క్యాంప్‌ను మహేష్ కుమార్.. ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం దొరకడం ఒక అదృష్టమన్నారు. పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నా.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు.

- Advertisement -

‘‘క్రమశిక్షణ గల కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు వరిస్తాయి. టీపీసీసీ అధ్యక్షుడి(TPCC Chief)గా నేను ఉదాహరణగా చెబుతున్నా.. రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ.. పరిస్థితులకు తగ్గట్టుగా సమయానుసారం నడుచుకోవాలి. వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం కష్టపడాలి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నా సలహా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా యూత్ కాంగ్రెస్ పనిచేయాలి. కష్టపడి పనిచేసిన యూత్ కాంగ్రెస్ నేతలకు రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తాం’’ అని Mahesh Kumar Goud అన్నారు.

Read Also: కాంగ్రెస్ గెలుపుకు బీఆర్ఎస్సే కారణం: కిషన్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

She Teams | మహిళలపట్ల అసభ్య ప్రవర్తన.. 247 మంది అరెస్ట్

నాంపల్లి ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో వేల మంది పాల్గొన్నారు. కాగా...

Kash Patel | FBI డెరెక్టర్ గా కాష్ పటేల్ నియామకం

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI)  డైరెక్టర్ గా కాష్ పటేల్(Kash...