TS Group 2 Exam Dates | గ్రూప్ -2 పరీక్ష తేదీ ఫిక్స్.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

-

TS Group 2 Exam | అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-2 పరీక్షా తేదీని టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఈ ఏడాది ఆగ‌స్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాత‌ప‌రీక్ష నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ప‌రీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లకు సెల‌వులు ప్రక‌టిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. య‌ధావిధిగా మిగ‌తా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు న‌డుస్తాయ‌ని స్పష్టం చేసింది. ఆగ‌స్టు 29, 30 తేదీల్లో ఉదయం, మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో గ్రూప్-2 ఎగ్జామ్(TS Group 2 Exam) నిర్వహించ‌నున్నారు. కాగా.. గ్రూప్-2 విభాగంలో 783 పోస్టులకు గాను 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడనున్నారు.

- Advertisement -
Read Also: బీఆర్ఎస్‌లో చేరికపై MLA రాజాసింగ్ క్లారిటీ!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...