Harish Rao శుభవార్త.. నిరుపేదలకు కార్పొరేట్ తరహా వైద్యం!

-

Harish Rao |శస్త్ర చికిత్సలు చేసి పసిపిల్లలకు ప్రాణం పోసిన యూకే వైద్యులకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు సన్మానం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతీ వందమంది పిల్లల్లో ఒకరికి గుండె సంబంధిత సమస్య ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు శస్త్ర చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత ఉండదని, ఈ క్రమంలో అనేకమంది పేదలు సంతానాన్ని కోల్పోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదలకు కార్పొరేట్ తరహా సేవలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. వచ్చే దసరా పండుగ వరకు వరంగల్ పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు.

- Advertisement -

రూ.6 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుందని  హరీష్ రావు(Harish Rao)  తెలిపారు. అంతేగాక, మరో 2 వేల పడకలతో నిమ్స్‌ను విస్తరిస్తామని అన్నారు. విదేశాల్లో ఉన్న వైద్య నిపుణులు సొంతగడ్డపై సేవలు అందించాలని పిలుపునిచ్చారు. వైద్య రంగంలోకి సరికొత్త విజ్ఞానం, సాంకేతికత అందించాలని కోరారు. ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత.. నిమ్స్‌లోనే తొలిసారి గుండె శస్త్రచికిత్సలు జరుగనున్నాయని అన్నారు. ప్రస్తుతం 3 నెలల చిన్నారికి గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని అన్నారు.

Read Also: తెలంగాణలో TRS పేరుతో కొత్త పార్టీ!!

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...