Hyderabad | బోనాల పండుగకు ముందురోజు బోయిన్‌పల్లిలో దారుణం

-

Hyderabad | మేడ్చల్ మల్కా్జ్‌గిరి జిల్లా బోయిన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయిన్‌పల్లిలోని నూతన్ కాలనీలో సత్యనారాయణ-ఝాన్సీ లక్ష్మీ అనే ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. గతకొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా.. శుక్రవారం కూడా ఇరువురి మధ్య గొడవ జరుగడంతో ఆవేశంలో కత్తితో భార్య ఝాన్సీ లక్ష్మీ మెడపై భర్త సత్యనారాయణ దారుణంగా నరికాడు.

- Advertisement -

Hyderabad | దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడిక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బోనాల పండుగకు ముందురోజు భార్యను హత్య చేయడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read Also: బీఆర్ఎస్‌లో చేరికపై MLA రాజాసింగ్ క్లారిటీ!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...