YS Sharmila | భట్టిని ఫోన్లో పరామర్శించిన షర్మిల.. విలీనం ఖాయమేనా?

-

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల(YS Sharmila) స్థాపించిన వైఎస్సార్టీపీని విలీనం చేస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. పాదయాత్ర చేస్తూ అనారోగ్యానికి గురైన తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను షర్మిల ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మరోవైపు త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి కూడా భట్టిన పరామర్శించారు. పొంగులేటి పరామర్శించిన అనంతరం షర్మిల కూడా ఫోన్ చేయడంతో విలీనం ఖాయమనే వార్తలు జోరందుకున్నాయి. కాగా ఇటీవల రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా షర్మిల ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంతో విలీనం వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి.

- Advertisement -
Read Also:
1. పొంగులేటి కాంగ్రెస్‌లోకి రావడం మంచిదే: రేణుకా చౌదరి
2. తెలంగాణపై కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయి: కవిత

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...