YS Sharmila | కొడుకు పెళ్లి తేదిని ప్రకటించిన వైయస్ షర్మిల

-

వైసీటీపీ అధినేత్రి వైయస్ షర్మిల(YS Sharmila) నూతన సంవత్సరం సందర్భంగా తన కుమారుడు పెళ్లి తేదిని అధికారికంగా ప్రకటించారు. అలాగే తనకు కాబోయే కోడలు వివరాలను కూడా వెల్లడించారు.

- Advertisement -

“అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి(Raja Reddy)కి, ప్రియమైన అట్లూరి ప్రియ(Atluri Priya)తో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయ(Idupulapaya)లోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉంది” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

ఇటీవలే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసిన షర్మిల కుమారుడు రాజారెడ్డి.. అట్లూరి ప్రియ అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. షర్మిల తల్లి విజయమ్మ కూడా ప్రియకు చీర పెట్టిన ఫొటో బయటకు రావడంతో పెళ్లి వార్తలకు బలం చేకూరింది. తాజాగా షర్మిల(YS Sharmila) ఆ వార్తలను నిజం చేస్తూ ట్వీట్ చేసింది.

Read Also: చలికాలంలో ఈ టిప్స్ పాటిస్తే జలుబు సమస్యలకు చెక్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...