Pakistan | పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 40 మంది దుర్మరణం

-

పాకిస్తాన్‌‌(Pakistan)లో జరిగిన భారీ బాంబు పేలుడులో 40 మంది మృతిచెందారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బజౌర్‌ జిల్లా ఖార్‌ పట్టణంలో అతివాద ఇస్లామిక్ పార్టీ “జమియత్ ఉలెమా ఏ ఇస్లాం-ఎఫ్” ఆదివారం నిర్వహించిన సభను టార్గెట్ చేసుకొని ఈ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 130 మంది గాయపడగా, వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Pakistan | తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ప్రాంతీయ రాజధాని పెషావర్‌కు విమానంలో తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ పేలుడులో జమియత్ ఉలెమా ఏ ఇస్లాం-ఎఫ్ పార్టీ స్థానిక అధ్యక్షుడు మౌలానా జియావుల్లా మరణించారు. ఈ సభలో పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ పాల్గొనలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: HYD పోలీసులపై MLA రాజాసింగ్ మరోసారి సీరియస్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...