వైసీపీలో చేరికపై గంటా క్లారిటీ

వైసీపీలో చేరికపై గంటా క్లారిటీ

0
33

పార్టీ ఏదైనా సరే తనకు మంత్రి పదవి తప్పనిసరి అనే పేరును ఘటించుకున్నారు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు… తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమిని ఎరుగని నేతగా ఎదిగారు గంటా… ఆయన రాజకీయ వాస్తు అలాంటిది మరి.

ఈ ఎన్నికల్లో గంటా ఖచ్చితంగా ఓటమిని చవిచూస్తారని టీడీపీ అధిష్టానం భావించింది. కానీ స్పల్పమేజార్టీతో గెలిచారు… ఇక పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన వైపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి… కానీ ఈ వార్తలపై ఇంతవరకు ఆయన స్పందించలేదు..

తాజాగా నేడు నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశ కమిటీకి ఆయన హాజరు అయ్యారు.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో పలు విషయాలపై గంటా చర్చించారు… అలాగే ఆయన పార్టీలో కొనసాగాలా వద్దా అనే అంశంపై కూడా కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారట. అయితే ఈ విషయాన్ని వారు బయట పెట్టకున్నారు.