3 క్యాపిటల్ విషయంలో చంద్రబాబుకు ఫైనల్ గా బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ సర్కార్….

3 క్యాపిటల్ విషయంలో చంద్రబాబుకు ఫైనల్ గా బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ సర్కార్....

0
29

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు… ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని భావిస్తే చంద్రబాబునాయుడు తన 23 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే అప్పుడు ఏపీ ప్రజలు అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారని అంగీకరిస్తామని అన్నారు… చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం అమరావతి రాజధాని కావాలంటున్నారని ఆమె మండిపడ్డారు…

2019 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించినా కూడా చంద్రబాబు నాయుడు సిగ్గులేండా అమరావతినే రాజధాని కావాలంటున్నారని మండిపడ్డారు… టీడీపీ నేతలు చేస్తున్న ఎత్తులన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు రోజా… వెనుక బడిన ప్రాంతాల అభివృద్దికోసం వైసీపీ సర్కార్ అనేక కార్యక్రమాలు చేస్తుంటే టీడీపీ అందుకు అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు… అలాగే మంత్రి కొడాలినాని కూడా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు…