ఇప్పుడు వాళ్ళు మాత్రమే పవన్ ని నమ్ముతున్నారు ..

ఇప్పుడు వాళ్ళు మాత్రమే పవన్ ని నమ్ముతున్నారు ..

0
35

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు నిలకడగా ఉండవని ,అయన ఎప్పుడు ఏ పార్టీ తో జతకడతారో ,ఎప్పుడు విడిపోతారో అన్న విషయం పై ఆయనకే క్లారిటీ ఉండదనేది చాల మంది చెప్పే మాట .అందుకే టీడీపీ ,వైసీపీ ల గురించి జనాల్లో వచ్చే ప్రస్తావన జనసేన గురించి రాదు .

అయితే ఎవరు నమ్మిన ,నమ్మకపోయినా అమరావతి రైతులు మాత్రం పవన్ ని నమ్మినట్లు తెలుస్తుంది . అమరావతి భూముల విషయం లో ఎప్పటి నుంచో రైతులకి పవన్ అండగా ఉన్నారు . మూడు రాజధానుల నిర్ణయం తరవాత అయన లాంగ్ మార్చ్ చేసి నిరసన తెలుపుతాననీ అయన అనటం తో రైతుల్లో పవన్ పై ఓ నమ్మకం ఏర్పడింది .

అయితే అయన బీజేపీ తో పోత్హు కుదుర్చుకుంది కూడా రైతులకి సపోర్ట్ గ నిలవడం కోసమే అని అందరు అనుకున్నారు .అయితే ఇప్పుడు పవన్ తీరు చూస్తున్న రైతులు తమ భూముల ప్రస్తావన తేకపోవడం ఫై అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది . అయన రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ బీజేపీ పంచన చేరాడని వారు అంటున్నారు . మరి పవన్ ఈ వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెప్పుకుంటారో చూడాలి మరి .