Champions Trophy | కంగారూలకే కంగారు పుట్టించిన కోహ్లీ

-

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్‌కు చేరింది. సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.. గేమ్ రానురాను చాలా ఇంట్రస్టింగ్‌గా సాగింది. చివరకు ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ గేమ్‌లో కూడా విరాట్ కోహ్లీ బాగా రాణించాడు. 84 పురుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

- Advertisement -

Champions Trophy | 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తనదైన సెటిల్డ్ గేమ్‌తో విజయం సాధించింది. ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ 29 బంతుల్లో 28 పరుగులు, అక్షర్ పటేల్ 30 బంతుల్లో 27 పరుగులు చేసి పర్వాలేనిపించారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్స్‌కు చేరిపోయింది.

Read Also: అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....

Rahul Gandhi | రాహుల్‌కి రూ.200 ఫైన్.. ఆ వ్యాఖ్యలే కారణం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది....