టీడీపీ కి షాక్…మాజీ ఎమ్మెల్యే మృతి

టీడీపీ కి షాక్...మాజీ ఎమ్మెల్యే మృతి

0
91

తెలుగుదేశం పార్టీకి తీరని విషాదం అనే చెప్పాలి.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఏలూరుకు చెందిన బడేటి బుజ్జి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు, సాధారణంగా ఇంట్లో గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ఉలుకుపలుకు లేకుండా ఉన్నారు.

ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు తెలిపారు. బుజ్జి మరణవార్తతో టీడీపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన లేరు అని తెలియడంతో ఏలూరులో టీడీపీ నేతలు అందరూ ఆయన ఇంటికి తరలి వచ్చారు.

బుజ్జిగా చిరపరిచితుడైన ఆయన పూర్తి పేరు బడేటి కోటి రామారావు. దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావుకు ఆయన స్వయాన మేనల్లుడు అవుతారు. సినీ రాజకీయ రంగంలో ఉన్న చాలా మంది ప్రముఖులకు బుజ్జీ సన్నిహితుడు, ఇటు పవన్ తో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు.. 2014-19 మధ్య ఏలూరు ఎమ్మెల్యేగా సేవలు అందించిన బుజ్జి గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే లోకేష్ కూడా ఆయన నివాసానికి రానున్నారు అని తెలుస్తోంది.