పసిడి పరుగులకు బ్రేక్..మళ్ళీ తగ్గిన ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

0
191

మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టడం మహిళలు ఆనందపడే విషయంగానే చెప్పుకోవచ్చు.

హైదరాబాద్ లో నేటి బంగారం ధరలు ఇలా..

పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.620 తగ్గి.. ప్రస్తుతం రూ.50,930గా కొనసాగుతుంది. ఇక వెండి విషయానికొస్తే..కిలో వెండి ధర రూ.900 తగ్గి..రూ.57,000గా పలుకుతుంది. దీంతో మహిళలు వచ్చే వారంలో కూడా ఇవే ధరలు కొనసాగాలని కోరుకుంటున్నారు.