కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం భేటీ..జాతీయ రాజకీయాలపై చర్చ

0
38

సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు కేసీఆర్. ఇక తాజాగా గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా దేశ రాజకీయాలపై జరగనున్నట్లు సమాచారం. కాగా 2024 లో బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అందులో భాగంగానే నాన్ బీజేపీ నాయకులను కలుపుకొని పోతున్నారు.