Suicide: దొంగతనానికి వచ్చి.. దేవుడి గదిలో ఉరేసుకున్నాడు

-

Suicide: బెంగళూరులోని ఇందిరానగర్‌లో విచిత్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగ.. పూజ గదిలో ఉరివేసుకున్నాడు. కాగా నిజంగా దొంగ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక మరేదైనా కారణం ఉందా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉంటున్న ఓ టెకీ కుటుంబం విదేశాలకు వెళ్లింది. ఈ క్రమంలోనే దిలీప్‌ బహుదూర్‌ అనే దొంగ, టెకీ కుటుంబం ఉంటున్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. శుభ్రంగా స్నానం చేసిన అనంతరం, ఇంటిలో ఉండే విలువైన వస్తువుల కోసం వెతికాడు.. కానీ తరువాత ఏమయ్యిందో ఏమో కానీ.. టెకీ కుటుంబం విదేశాల నుంచి వచ్చి చూసేసరికి దొంగ దేవుడి గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. నిర్ఘారింతపోయిన టెకీ కుటుంబం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు దొంగ దిలీప్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు దిలీప్‌ ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా దిలీప్‌ 2006లోనే ఓ దొంగతనం కేసులో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Read also: వెస్టిండీస్‌ ప్రధాన కోచ్‌ రాజీనామా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...