Father kills Daughter: కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి

-

Father kills Daughter: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి కూతురు పాలిట కాలయముడయ్యాడు. ఎంత చెప్పిన వినకుండా ఓ అబ్బాయితో సన్నిహితంగా ఉంటుందని కన్నబిడ్డను అనంతలోకాలకు పంపేశాడు ఓ కసాయి తండ్రి. 15 ఎళ్లు కంటికి రెప్పలా చూసుకున్న కుమార్తెను తన మాట వినలేదన్న కోపంతో క్షణికావేశంలో గొడ్డలితో ఏకంగా ఎనిమిది సార్లు నరికేశాడు. దీంతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం, పాత పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రాజశేఖర్-సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు గీత (15) పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ బాలుడుతో కుమార్తె సన్నిహితంగా మెలగడాన్ని చూసిన రాజశేఖర్ కుమార్తెను పలుమార్లు హెచ్చరించాడు.

- Advertisement -

ఈ క్రమంలో మంగళవారం కుమార్తె (Daughter) గీతకు మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొని కుమార్తె మెడ పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గీత రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం రాజశేఖర్ నేరుగా పోలీస్ స్టేషన్‍కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...