భాస్కర్​రెడ్డికి వైద్య పరీక్షలు.. అనంతరం జడ్జి ఎదుట హాజరు

-

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder Case)లో అరెస్టు చేసిన భాస్కర్​రెడ్డి(YS Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు ఆదివారం మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షలు చేస్తుండగా ఒక్కసారిగా భాస్కర్​రెడ్డి బీపీ లెవెల్స్​పెరిగిపోయాయి. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స చేసి బ్లడ్​ప్రెషర్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు జరిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఈ సందర్భంగా భాస్కర్​రెడ్డి(YS Bhaskar Reddy) వైద్యులతో అన్నట్టు సమాచారం. పరీక్షల అనంతరం సీబీఐ అధికారులు భాస్కర్​రెడ్డిని శాంతినగర్ ​జడ్జెస్ ​క్వార్టర్స్​లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి నివాసంలో ఆయన ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జడ్జి భాస్కర్​రెడ్డికి పది రోజుల కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు అతన్ని చెంచల్​గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. కాగా, భాస్కర్​రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి తన క్లయింట్‌కు బెయిల్​మంజూరు చేయాలంటూ పిటీషన్​దాఖలు చేశారు.

- Advertisement -
Read Also: పెళ్లిమీద నమ్మకం లేదు.. డేటింగ్‌తోనే కంటిన్యూ అవుతా: శృతి హాసన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మందుబాబులకు షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

Liquor Shops | తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి...

AB Venkateswara Rao | ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేత

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది....