ఆ సినిమా చూసి కంటతడి పెట్టిన RRR సృష్టికర్త

-

ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కంగనానే కథ రాసుకొని దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ సినిమా కోసం కంగనా(Kangana Ranaut) చాలా కష్ట పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫైనల్ ఎడిటింగ్ అవుట్ పుట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే ఆ అవుట్‌పుట్‌ని కంగనా మొదటగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌(Vijayendra Prasad )కు చూపించిదట. ఈ విషయాన్ని కంగనా స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆ సినిమా చూస్తునంతసేపు విజయేంద్ర ప్రసాద్ చాలాసార్లు కళ్ళు తుడుచుకున్నారని చెప్పుకొచ్చింది. సినిమా మొత్తం చూశాక.. “నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి” అంటూ ప్రశంసించారని పేర్కొంది. ఆ మాటలు నా జీవితంలో మర్చిపోలేనని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....