సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి షాక్.. ‘ది కేరళ స్టోరీ’కి రూట్ క్లియర్!

-

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై నిషేధం విధించిన పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఈ నిషేధం గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని చూడటం సరికాదని, అలా అనుకుంటే సినిమాలన్నీ కోర్టులకే చేరుతాయని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మూవీకి సీబీఎఫ్ సీ సర్టిఫికెట్ జారీ చేసిందని,  బ్యాన్ చేయడం సరికాదని పేర్కొంది. శాంతి భద్రలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది.
మరో వైపు తమిళనాడులో భద్రతా కారణాలను చూపుతూ ఎగ్జిబిటర్లు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయడంపై ప్రభుత్వమే సినీ ప్రేక్షకులకు భద్రత కల్పించాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మూవీకి సీబీఎఫ్ సీ సర్టిఫికెట్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను జూలై రెండో వారంలో విచారిస్తామని తెలిపింది. ఈ అంశంలో నిర్ణయం తీసుకునే ముందు చిత్రాన్ని తాము చూడాలనుకుంటున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. సూదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ(The Kerala Story) మూవీ మే 5న విడుదల కాగా ఈ సినిమాపై బెంగాల్ ప్రభుత్వం(Mamata Banerjee govt) మే 8న నిషేధం విధించింది. తమిళనాడు ప్రభుత్వం సైతం పరోక్షంగా ఇదే నిర్ణయాన్ని అమలు చేయడంపై మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు పై నిర్ణయాన్ని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...