ఆ సినిమా చూసి కంటతడి పెట్టిన RRR సృష్టికర్త

-

ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కంగనానే కథ రాసుకొని దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ సినిమా కోసం కంగనా(Kangana Ranaut) చాలా కష్ట పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫైనల్ ఎడిటింగ్ అవుట్ పుట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే ఆ అవుట్‌పుట్‌ని కంగనా మొదటగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌(Vijayendra Prasad )కు చూపించిదట. ఈ విషయాన్ని కంగనా స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆ సినిమా చూస్తునంతసేపు విజయేంద్ర ప్రసాద్ చాలాసార్లు కళ్ళు తుడుచుకున్నారని చెప్పుకొచ్చింది. సినిమా మొత్తం చూశాక.. “నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి” అంటూ ప్రశంసించారని పేర్కొంది. ఆ మాటలు నా జీవితంలో మర్చిపోలేనని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pushpa 2 | బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈసారి అసలు తగ్గేదేలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. 'పుష్ప2(Pushpa...

సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్..

ఏపీ సీఎం జగన్(CM Jagan)కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)...