కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి

-

మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్(Revanth Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ ఠాగూర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరవాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సినీ నటి విజయ శాంతికి టిక్కెట్ ఇవ్వడంతో పార్టీ పై అసంతృప్తితో ఆయన బిజెపి(BJP)లో చేరారు. కొంత కాలం అందులో ఉన్న శశిధర్ రెడ్డి బిజెపికి సైతం రాజీనామా చేశారు. గతంలో బీఆర్ఎస్(BRS) లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.. కానీ కాంగ్రెస్ నేతల హామీతో కొంత కాలం ఏ పార్టీలో చేరాకుండా స్తబ్దంగా ఉన్నారు.. కానీ రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also:
1. చాణక్య నీతి: ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలకే కోరిక ఎక్కువ
2. అమెరికా అధ్యక్షుడి హత్యకు యత్నించిన తెలుగు యువకుడికి భారీ శిక్ష
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీమ్ పాక్ దుస్థితికి కారణమేంటో చెప్పిన అశ్విన్

టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల...

బాలీవుడ్ ఎంట్రీపై సూర్య క్లారిటీ.. ఇప్పుడు చెప్పనంటూ..

బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై...